ఈ వార్తను అనువదించండి:

Peddapalli: పెద్దపల్లిలో ఆక్రమ కట్టడాలపై కలెక్టర్‌ ఫోకస్‌ పెట్టారు. బందంపల్లిలో ఆక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉదయమే కూల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చెరువుల ఆక్రమణలపై కలెక్టర్ సర్వే చేయించారు. ఆక్రమణలపై మున్సిపల్‌ కమిషనర్‌కు నివేదిక అందించారు. నివేదిక ఆధారంగా బఫర్‌ జోన్‌లో ఉన్న కట్టడాలు కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. బందంపల్లి చెరువులో ఉన్న కట్టడాలు జేసీబీతో కూల్చివేస్తున్నారు. రాబోయే రోజుల్లో చెరువు ఆక్రమణాలు తొలగిస్తాం అని ఆర్డీవో తెలిపారు.

పూర్తిగా చదవండి..