ఈ వార్తను అనువదించండి:

భవానీ శంకరి: భారీ వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. విజయవాడ పరిసర ప్రాంతాలు నీట ముగినిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో రక్షణ చర్యల నేపథ్యంలో నేరుగా రంగంలోకి దిగిన నూజివీడు సబ్ కలెక్టర్ భవానీ శంకరీ.. 8 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 82 మందిని కాపాడారు. విపత్కరమైన పరిస్థితుల్లో ధైర్యం చేసి తమ ప్రాణాలు కాపాడిన భవాని శంకరీపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రమాదానికి ఎదురొచ్చి తమను రక్షించిన కలెక్టర్ కు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆమెను ప్రశంసించారు. నీటిలో శంకర్ చేపట్టిన పనులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

పూర్తిగా చదవండి..