News June 30, 2024
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఆరికరేవుల ఏటిగట్టుపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటార్ సైకిల్ను లారీ ఢీకొన్న ఘటనలో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న తాత, మనవడు మృతిచెందారు. మృతులు మాసా వీర్రాజు (55), పాముల ధనుష్ (12)గా చెబుతున్నారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.