Balayya-Rakul: తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా మొన్నటి వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కీ మకాం మార్చి అక్కడ ఫుల్ బిజీ అవ్వాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.
కానీ బాలీవుడ్ లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అయితే బాలీవుడ్ లో బిజీ అవ్వాలి అన్న ప్రయత్నంలో రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని తెలుగు సినిమాలను కూడా రిజెక్ట్ చేసిందట. ఇలా రిజెక్ట్ చేసిన సినిమాలలో బాలయ్య బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఉంది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామందికి ఈ విషయం గురించి అసలు తెలియదు. ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ రిజెక్ట్ చేసిన ఆ సినిమా ఏది? సినిమాను ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది అన్న వివరాల్లోకి వెళితే.. అయితే బాలయ్య బాబు రకుల్ ప్రీతిసింగ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా మరేదో కాదు.
ఇటీవలే విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకున్న అఖండ సినిమానే. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య డ్యూయల్ రోల్ నటించిన విషయం తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీకాంత్, నితిన్ మెహతా, పూర్ణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన అఖండ మూవీ 2021లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రూ. 60 బడ్జెట్ తో నిర్మితమైన అఖండ ఫుల్ రన్ లో రూ. 150 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఈ సినిమా 103 సెంటర్లలో 50 రోజుల రన్ ను పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ భార్యగా, ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రగ్యా నటించిన విషయం తెలిసిందే.
అక్కడ బిజీగా ఉండటంతో…
అందం అభినయంతో పాటుగా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్. అయితే అఖండ మూవీ లో హీరోయిన్ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ ప్రగ్యా జైస్వాల్ కాదట. డైరెక్టర్ బోయపాటి మొదట రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట. కానీ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె నో చెప్పింది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ ను సంప్రదించగా పర్సనల్ రీజన్స్ తో ఆమె కూడా రిజెక్ట్ చేసిందట. దాంతో బోయపాటి మరో ఆలోచన లేకుండా ప్రగ్యాను ఎంపిక చేశారని తెలుస్తోంది. కేవలం రకుల్ బాలీవుడ్లో సినిమాలు ఉండడం కారణం చేతనే ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.