ఈ వార్తను అనువదించండి:
మంత్రి లోకేష్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగారు మంత్రి లోకేష్. ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న మీకు ఆ హుందాతనం ఉందా జగన్? అని ప్రశ్నించారు. బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన మీరు బెంగుళూరు ప్యాలస్ లో రిలాక్స్ అవుతూ 74 ఏళ్ల వయస్సు లో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబు పై విమర్శలు చెయ్యడానికి మనస్సు ఎలా వచ్చిందని అన్నారు.
పూర్తిగా చదవండి..
లోకేష్ ట్విట్టర్ (X)లో.. “విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర మీకు లేదు..పైగా మీరు ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందే! నాడు చంద్రబాబు గారు బుడమేరు ఆధునీకరణకు రూ.464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే మీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణం అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్.
ఆధునీకరణ, మరమ్మత్తుల పనులు ఆపేసారు. సుమారుగా రూ.500 కోట్లు విలువైన 600 ఎకరాలు వైసిపి నాయకులు కబ్జా చేశారు. 2022 లోనే గండి పడినా పట్టించుకోలేదు. 5 ఏళ్ళలో సరైన నిర్వహణ లేదు. విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేసారు. మీ పాలన వైఫల్యాలే నేడు ప్రజల కష్టాలు. అన్ని సమస్యలను అధిగమిస్తాం. చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకూ విశ్రమించం.” అని ఫైర్ అయ్యారు.
[vuukle]