ఈ వార్తను అనువదించండి:

స్టేషన్లు & కష్మెరె: పార్లమెంటు దాడి దోషి మహ్మద్ అఫ్జల్ గురు సోదరుడు ఐజాజ్ అహ్మద్ గురు జమ్మూ$కశ్మీర్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించాడు. సోపోర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఐజాజ్ అహ్మద్ గురు తెలిపాడు. ఈ మేరకు మంగళవారం ఐజాజ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమారుడు షోయబ్ ఐజాజ్ గురు డ్రగ్స్ కేసులో అక్రమ అరెస్టు కారణంగానే తాను రంగంలోకి దిగాల్సివస్తుందని అన్నారు. అలాగే సోపోర్‌ అభివృద్ధిని గత పాలకులు విస్మరించారని, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత పునరావాసం వంటి దీర్ఘకాలిక స్థానిక సమస్యలను పరిష్కరించడానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పాడు. గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తానని ఐజాజ్ స్పష్టం చేశాడు. అయితే తన ప్రచారంలో తన సోదరుడు అఫ్జల్ గురు పేరును ప్రస్తావించబోనని స్పష్టం చేశారు.

పూర్తిగా చదవండి..