ఈ వార్తను అనువదించండి:

హైడ్రా: హైదరాబాద్ లో చెరువులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రకు షాక్ తగిలింది. హైడ్రాపై జాతీయ మానవ హక్కుల సంఘానికి బాధితుల ఫిర్యాదు చేశారు. ఈనెల 8న సున్నం చెరువులో గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయకుండా ఉన్నపళంగా గుడిసెలు తొలగించడంపై బాధితుల ఫిర్యాదు చేశారు. హైడ్రా రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించిందని బాధితులు వాపోతున్నారు. 1985 ఓల్గా టెల్లిస్‌ వర్సెస్‌ బాంబే మున్సిపల్‌ కార్పొరేషన్‌ కేసులో సుప్రీం తీర్పు ఇచ్చిన విషయాన్ని ఫిర్కాదులో బాధితులు పేర్కొన్నారు. కాగా హైడ్రా పై మానవ హక్కుల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

పూర్తిగా చదవండి..