ఈ వార్తను అనువదించండి:

మహేష్ గౌడ్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన దాడిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. అరికెపూడి గాంధీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగా లేదని అన్నారు. ఎవరు ఎవరిపై దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదని.. దాడులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని చెప్పారు. ఈ దాడితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కౌశిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే గాంధీ అనుచరులు ఆగ్రహానికి గురై దాడికి దిగారని అన్నారు. అరికెపూడి టెక్నీకల్ గా బీఆర్ఎస్ సభ్యుడే అని పేర్కొన్నారు. నిబంధనల మేరకే పీఏసీ ఛైర్మన్ అయ్యారని అన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లుయ్ ఉప ఎన్నిక వస్తే ఆ ఉపఎన్నికలో విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు.

పూర్తిగా చదవండి..