శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీ ఇంటికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం అరికెపూడి ఇంటికి వచ్చారు. ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అరికెపూడి మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి 2018లో వచ్చాడన్నారు. తనను కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లే స్థాయి ఆయనది కాదన్నారు. పదేళ్ల నుంచి తాను పార్టీలో ఉంటున్నానన్నారు. అవసరమైతే తానే కేసీఆర్ను డైరెక్ట్గా కలుస్తానన్నారు. ప్రాంతీయ విభేదాల గురించి కౌశిక్రెడ్డి మాట్లాడడంపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. వివాదం తనకు, కౌశిక్రెడ్డి మధ్యే కానీ పార్టీతో కాదని స్పష్టం చేశారు.
ఈ వార్తను అనువదించండి: