జబర్దస్త్ ఫేమ్ పంచ్ ప్రసాద్ కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. కిడ్నీ, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఆయనకు సహాయం చేసిన వారిలో నటి, మాజీ మంత్రి రోజా కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆమె ప్రభుత్వం ద్వారా వైద్యం కోసం అవసరమైన సాయం అందించారు.
తాజాగా ఒక టీవీ షోలో రోజాతో కలిసి పాల్గొన్న పంచ్ ప్రసాద్, ఆమెకు కృతజ్ఞతగా స్టేజ్ మీద కాళ్ల మీద పడ్డారు. “ఈరోజు నా భార్య, పిల్లలతో ఆనందంగా జీవిస్తున్నాను అంటే.. ఇది మీ పెట్టిన భిక్ష మేడమ్. మీరు నాకు మా అమ్మ కన్నా ఎక్కువ” అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సంఘటనను స్వయంగా రోజా కూడా గుర్తు చేసుకుంటూ, “నేను చేయగలిగినంత సాయం చేసాను.. మిగతా దేవుడి దయ” అంటూ స్పందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రోజా ఒకప్పుడు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించగా, పంచ్ ప్రసాద్ ప్రముఖ కంటెస్టెంట్గా నవ్వులు పూయించారు. రాజకీయాల్లో బిజీగా మారిన రోజా, ఇప్పుడు టీవీకి రీ ఎంట్రీ ఇస్తూ పలు షోల్లో కనిపిస్తున్నారు. ఈ సంఘటన అభిమానుల మన్ననలు పొందుతోంది. మంచి మనసుతో చేసిన సహాయం ఎన్నటికీ మరవలేనిదని అందరూ అభిప్రాయపడుతున్నారు.