
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమా సితారే జమీన్ పర్ (Sitare Zameen Par)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి హైప్ క్రియేట్ చేసింది. సితారే జమీన్ పర్ రిలీజ్ తరువాత అమీర్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ మహాభారతం (Mahabharata) పై పని ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్ లో అత్యంత భావోద్వేగభరితమైన, భారీ సినిమాగా భావిస్తున్నారు.
ఇటీవల అమీర్ ఖాన్ రాజ్ షమానీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ జీవితం, సినిమాలు, తదుపరి ప్రాజెక్టుల గురించి ముఖ్యమైన విషయాలను పంచుకున్నాడు. మహాభారతం సినిమా అతని చివరి సినిమా కావచ్చని, ఈ ప్రాజెక్ట్ తరువాత ఆయన మరింత సినిమా చేయకపోవచ్చని చెప్పాడు. “మహాభారతం కథలో అన్ని జీవన భావాలు ఉంటాయి. ఈ సినిమా తరువాత నా కెరీర్ ముగిసినట్లే అనిపిస్తుందని” అన్నారు.
ఇప్పటికే అమీర్ ఖాన్ సన్నీ డియోల్ నటిస్తున్న మరో సినిమా లో కూడా నటిస్తున్నారు. అలాగే “లాహోర్ 1947”లో అతిధి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే బీ టౌన్ లో వినిపిస్తున్నట్లు అమీర్ ఖాన్ మహాభారతం సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తారని టాక్ ఉంది. అల్లు అర్జున్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యే అవకాశం ఉంది.
మొత్తానికి, అమీర్ ఖాన్ తన కెరీర్ లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. మహాభారతం వంటి ప్రాజెక్ట్ తో అభిమానులకు మళ్ళీ తన నటన చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశాడు. ఈ సినిమా విడుదల కోసం అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.