దానిపై ఓ బుక్ కూడా రాయగలను – అదాశర్మ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 14, 2024 9:01 AM IST

హీరోయిన్ అదాశర్మ ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అటు సినిమాలతో పాటు ఇటు వెబ్‌ సిరీస్‌ లతోనూ ఈ బ్యూటీ ఆకట్టుకుంటుంది. ఐతే, ఆమె నటించిన తాజా సిరీస్‌ ‘రీటా సన్యాల్‌’ ఈ రోజు నుంచి ఓటీటీ ‘డిస్నీ+హాట్‌ స్టార్‌’ లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అదాశర్మ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

అదాశర్మ మాట్లాడుతూ.. ‘ది కేరళ స్టోరీ’.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. అలాగే, రికార్డులు కూడా బ్రేక్‌ చేసింది. వాటికిమించి ప్రేక్షకుల హృదయాల్లో నాకు సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. నిజానికి ది కేరళ స్టోరీకి ముందు నేను ఎన్నో సార్లు నిరాశకు గురయ్యాను. ఆ సమయంలో ది కేరళ స్టోరీ వచ్చింది. ఆ కథ పై ఎంతో చదివాను. ఒక విధంగా దానిపై నేను పుస్తకం కూడా రాయగలను అని నవ్వుతూ అదాశర్మ చెప్పింది. మొత్తానికి ఓ విజయం.. చేదు జ్ఞాపకాలను మర్చిపోయేలా చేస్తుంది. నా విషయంలోనూ అంతే’ అని అదాశర్మ తెలిపింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *