
దక్షిణాది దర్శకుడు శంకర్ కూతురిగా అదితి శంకర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు పరిశ్రమలోకి ఆమె తొలి చిత్రం “భైరవం” ద్వారా అడుగు పెట్టింది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి స్టార్ హీరోలతో కలిసి మాస్ యాక్షన్ డ్రామాగా పాజిటివ్ టాక్ వచ్చింది. నటిగా మాత్రమే కాక, సింగర్ గా కూడా అదితి మంచి పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు మరొక మాస్ హీరో రవితేజ సరసన నటించే అవకాశం అదితికి దక్కింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న తాజా చిత్రంలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం కేతిక శర్మ, మమితా బైజు పేర్లు వినిపించగా, ఇప్పుడు అదితి శంకర్ పేరు ఫైనల్ అయ్యిందని టాక్. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రంలో అదితి కీలక పాత్రలో కనిపించనుంది.
అదితి విద్యాభ్యాసం కూడా ప్రత్యేకం. డాక్టర్ చదువు పూర్తి చేసిన ఈ అమ్మడు నటనపై పూర్తి దృష్టి పెట్టి సినీ రంగంలో తన అదృష్టాన్ని సాదించుకుంటోంది. భైరవం సినిమాలో మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత తెలుగు చిత్రాల్లో మరిన్ని అవకాశాలు పొందుతుందనీ భావిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అదితి శంకర్ తన ప్రతిభ, ప్రతిష్టతో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. రవితేజతో కలిసి చేస్తున్న తాజా ప్రాజెక్ట్ ఆమె కెరీర్కి మరింత మైలురాయిగా నిలవబోతోంది. తెలుగు ప్రేక్షకులు ఆమె నటనకు నిరీక్షణతో ఉన్నారు.