సౌత్ ఇండియా సినిమా స్టార్ అజిత్ కుమార్ ప్రత్యేకమైన కుటుంబ మూలాలను కలిగి ఉన్నారు. అతని తల్లిదండ్రులు రెండు భిన్న ప్రాంతాలకు చెందినవారు. అజిత్ తండ్రి పి. సుబ్రహ్మణ్యన్ కేరళలోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందిన కేరళీయ-తమిళుడు. అయితే అజిత్ తల్లి మోహిని పాకిస్తాన్ లోని కరాచీ ప్రాంతానికి చెందిన సింధీ హిందూ కుటుంబానికి చెందుతారు.
దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి అనేక మంది హిందువులు భారతదేశానికి కాందిశీకులుగా తరలారు. అజిత్ తల్లి కుటుంబం కూడా ఆ తరవాత కలకత్తాలో స్థిరపడింది. అజిత్ కుమార్ ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన తల్లి పాకిస్తాన్ కరాచీ నుంచి వచ్చిన వలసదారులే అని చెప్పారు.
అయితే అజిత్ కుమార్ సికింద్రాబాద్ ప్రాంతంలో జన్మించడంతో, ఎక్కువగా తెలుగు అబ్బాయిగా గుర్తింపు పొందారు. ఈ విభిన్నమైన మూలాలు అజిత్ కుటుంబానికి ప్రత్యేక సాంస్కృతిక వారసత్వాన్ని అందిస్తున్నాయి. కేరళ, తమిళం మరియు సింధీ సంస్కృతుల మేళవింపు ఆయన వ్యక్తిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ప్రత్యేక నేపథ్యం అజిత్ కుమార్ అభిమానులకు అతని వ్యక్తిత్వంపై మరింత ఆసక్తి కలిగిస్తోంది. అజిత్ కుటుంబ కథనం భారతదేశం, పాకిస్తాన్ మధ్య విభజన నేపథ్యంలో ఒక చారిత్రక సందర్భాన్ని కూడా ప్రతిబింబిస్తోంది.