Allu Aravind reacts to Telangana theatre shutdown news
Allu Aravind reacts to Telangana theatre shutdown news

తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల మూసివేతపై కొనసాగుతున్న వివాదం గురించి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల “ఆ నలుగురు” అనే పదాన్ని ప్రతికూలంగా వాడుతూ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. “ఆ నలుగురిలో నేనెప్పుడూ లేను. థియేటర్ వ్యాపారాన్ని నేను COVID కాలంలోనే వదిలేశాను” అంటూ స్పష్టం చేశారు.

ప్రస్తుతం తన వద్ద ఒక్క థియేటర్ మాత్రమే – AAA Cinemas ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో తనకే ఒక్క థియేటర్ లేదని చెప్పారు. తన వద్ద ఉన్న 15 థియేటర్లు కూడా త్వరలో విడిపోతాయని వివరించారు. అంతేకాకుండా, థియేటర్ల సమస్యలు వాస్తవమేనని, వాటిని పరిష్కరించేందుకు చాంబర్, గిల్డ్ (Guild) లాంటి సంస్థల ద్వారా సమగ్ర చర్చలు జరపాలని సూచించారు. ఒకేసారి థియేటర్లు మూసేయడం అనేది సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా విడుదల సమయంలో థియేటర్లు మూసేస్తే, అది ఆప్యాయత చూపే ప్రవర్తన కాదని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఎంతగానో సహాయం చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వంతో కలిసి ప్రైవేట్ వ్యాపారాలు నడిపే విధానమే సరైందని, దాన్ని విస్మరించడం తగదు అని స్పష్టం చేశారు.

తనకు క్యూబ్ (Qube) లేదా యూఎఫ్‌వో (UFO) సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని, సురేష్ బాబు గారికీ కాదు అని తేల్చి చెప్పారు. గిల్డ్ వల్ల నిర్మాతలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *