‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్తో వార్తల్లో నిలిచారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ సినిమా ‘స్పిరిట్’ కోసం ఆయన రెడీ అవుతున్నప్పటికీ, సమాంతరంగా నిర్మాతగా కూడా ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై ఓ చిన్న సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్తో కొత్త దర్శకుడు వేణు తెరపైకి రానున్నారు. కథా పరంగా ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నడిచే పల్లెటూరి ప్రేమకథగా ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ను ఎంపిక చేసినట్లు తెలిసింది.‘మ్యాడ్’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ‘ 8 వసంతాలు’లో సహజమైన నటనతో ఆకట్టుకున్న అనంతికకు ఇది మంచి అవకాశం అని సినీ వర్గాలు అంటున్నాయి. హీరోగా ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ కనిపించబోతున్నాడు. కొత్త జంటగా ప్రేక్షకులకు కొత్త ఫ్రెష్నెస్ ఇవ్వనుంది.