ఘాటీ, కథనార్ సినిమాలతో బిజీగా ఉన్న బాహుబలి బ్యూటీ అనుష్క శెట్టి కొత్త ప్రాజెక్ట్తో మరోసారి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ఘాటీ షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. అయితే ఈ సమ్మర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఘాటీ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం అభిమానుల అంచనాలను భారీగా పెంచుతోంది.
ఇంకా మలయాళంలో కథనార్ అనే చిత్రంలోనూ అనుష్క నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆమె మలయాళం కూడా నేర్చుకున్నారు. బాహుబలి ప్రమోషన్ల సమయంలోనే ఆమె మలయాళాన్ని మాట్లాడటానికి ట్రై చేయగా, ఇప్పుడు మరింతగా స్కిల్ను పెంచుకున్నారట.
ఇదిలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం తమిళంలో హారర్ కామెడీ సినిమాలకు స్పెషలిస్ట్ అయిన సుందర్.సి అనుష్కకు ఓ కథ చెప్పారట. ఈ కథ అనుష్క కెరీర్లో మరో అరుంధతి అవుతుందని కోలీవుడ్ టాక్. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ సుందర్.సి ఈ ప్రాజెక్ట్ను రూపొందించనున్నారని తెలుస్తోంది.
ఇక మరోవైపు నవీన్ పొలిశెట్టి – మణిరత్నం కాంబోపై కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అనుష్కతో కలసి లేడీ లక్ పాటలో కనిపించిన నవీన్ త్వరలో మణిరత్నం సినిమాలో నటించనున్నారట.