పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం AA22. ఇది అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ. ‘పుష్ప’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ‘జవాన్’, ‘బిగిల్’ వంటి హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అట్లీ తొలిసారిగా తెలుగులో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమా నిర్మాతగా సన్ పిక్చర్స్ వ్యవహరిస్తుండగా, కళానిధి మారన్ సమర్పణలో వస్తోంది.
ఇటీవల లాస్ ఏంజెల్స్ స్టూడియోలో చిత్రీకరించిన గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి రూపొందించిన ఈ వీడియో, సినిమా స్థాయిని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం A22 x A6గా పిలవబడుతోంది. జూన్ 2025లో చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది.
ఈ చిత్రం భారతీయ విలువలు, భావోద్వేగాలు, మాస్ యాక్షన్ కలిపిన భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్తో ఈ మూవీ కొత్త రికార్డుల్ని నెలకొల్పుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నటీనటుల వివరాలు, రిలీజ్ డేట్ త్వరలో వెల్లడించనున్నారు.