నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఆయనకు మరో అరుదైన గౌరవం వచ్చి చేరింది. న్యూఢిల్లీలోని భరత్ మండపంలో అట్టహాసంగా జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (IFFD) 2026 వేడుకల్లో బాలకృష్ణను ‘భైరవ-రుద్ర’ సేమ్ టు సేమ్ అట!?‘జీవిత సాఫల్య పురస్కారం’ (Lifetime Success Award)తో ఘనంగా సత్కరించారు. సినిమా రంగంలో యాభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న బాలకృష్ణ పౌరాణిక పాత్రల్లో తండ్రికి తగ్గ తనయుడిగా మెప్పించడమే కాకుండా, మాస్ ఎంటర్టైనర్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఆయనకే చెల్లింది. మార్చి 25న జరిగిన ఈ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డును అందుకున్నారు.
Additionally Learn : Prabhas-Mahesh Babu: నమ్మొచ్చా..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా నిలిచి సంచలనం సృష్టించింది. కళారంగానికి బాలకృష్ణ చేసిన విశేష కృషిని గుర్తిస్తూ 2025లో భారత ప్రభుత్వం దేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’తో గౌరవించింది. నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలతో (బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి), రాజకీయ నాయకుడిగా కూడా బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు.
