ఇప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొంది, కోట్లలో పారితోషికం తీసుకుంటున్న నటులు మొదట విమర్శలతోనే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు వీరికి ఒక చిన్న గెస్ట్ రోల్ చేసినా కోట్లలో రెమ్యునరేషన్ అందుతుంది.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ రజినీకాంత్ తన కూతురు నిర్మించిన “లాల్ సలామ్” అనే సినిమాలో అతిథి పాత్రకు రూ.40 కోట్లు పారితోషికం తీసుకున్నారట. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ “ఆత్రంగి రే” అనే సినిమాకు గెస్ట్ రోల్ చేసినందుకు రూ.27 కోట్లు తీసుకున్నారు. అదే విధంగా RRR సినిమాలో అతిథి పాత్ర చేసిన అజయ్ దేవగన్కు రూ.25 కోట్లు, అలియా భట్కు రూ.9 కోట్లు ఇచ్చారట.
కానీ తాజాగా ఈ రికార్డును బ్రేక్ చేస్తూ నందమూరి బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. రజినీకాంత్ నటిస్తోన్న “జైలర్ 2” అనే సినిమాలో బాలయ్య ఓ ముఖ్య పాత్రలో కనిపించనుండగా, దీనికి ఆయన ఏకంగా రూ.50 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్.
ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదైనప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బాలయ్య భారీ పారితోషికం తీసుకుంటున్నారనే వార్తలతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గెస్ట్ రోల్స్కు ఇంత రెమ్యునరేషన్ అందించడం ఇండియన్ సినిమా స్థాయిని తెలియజేస్తుంది.