భోళా శంకర్ – మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని ఓ ఘోరమైన అపజయం. 2023లో Independence Day వీకెండ్కు విడుదలైన ఈ చిత్రం, భారీ అంచనాల నడుమ విడుదలై థియేటర్లలో మాత్రం ఘోరంగా ఫెయిలయ్యింది.
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో చిరంజీవి సరసన తమన్నా నటించగా, కీర్తి సురేష్ ఆయన చెల్లెలు పాత్రలో కనిపించింది. తమిళంలో భారీ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని రీమేక్ చేసినప్పటికీ, తెలుగులో మాత్రం ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
రిలీజ్కి ముందు ఈ మూవీ టీజర్లు, పాటలు, ట్రైలర్ చూసి మెగాభిమానులూ, చిరంజీవి కూడా హిట్ ఖాయమని నమ్మారు. చిరంజీవి సినిమాలపై judgment బాగా ఉండే ఆయనకే ఈసారి తప్పిపోయింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో, సినిమా కలెక్షన్స్ భయంకరంగా క్షీణించాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ మొదట పవన్ కల్యాణ్తో ప్లాన్ చేశారని సమాచారం. కానీ ఎన్నికల కారణంగా షెడ్యూల్స్ కుదరక ఆయన నుంచి తప్పిపోయి చిరంజీవికి వచ్చిందట. అభిమానుల మాటల్లో చెప్పాలంటే, “ఈ సినిమా చిరుతో కాకుండా పవన్తో తీసుంటే బాగుండేది.”
ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి రెండు సంవత్సరాల పాటు వెండితెరపై కనిపించలేదు. ఇలాంటి ఫ్లాప్స్ కూడా మెగా ఫ్యామిలీ హీరోలకు తీవ్ర ఆలోచనలకు దారితీస్తున్నాయి. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ చిరు తదుపరి సినిమా మీదే.