ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాల తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ ఆసక్తికర అప్డేట్ను పంచుకున్నారు.
ప్రస్తుతం చరణ్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ను షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు ఇద్దరితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “షూటింగ్ ఎంతో ఎంటెర్తైనింగ్ గా జరుగుతోంది” అని తెలిపారు.
ఫోటోలలో రామ్ చరణ్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో పూర్తి మాస్ స్టైలిష్ లుక్లో కనిపించి అభిమానులను ఫిదా చేస్తున్నారు. ఆ ఫోటోలు వైరల్ అవుతూ సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నాయి.
ఈ చిత్రం ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ముఖ్యంగా క్రికెట్ నేపథ్యంలో చరణ్ పాత్ర బలంగా ఉంటుందని తెలుస్తోంది. బర్త్డే సందర్భంగా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే మూవీపై హైప్ మామూలుగా లేదు.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2026 మార్చి 27న విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.