తమిళ స్టార్ విక్రమ్ చియాన్ తన 63వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ‘మండేలా’, ‘మావీరన్’ వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన మడోనా అశ్విన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. శాంతి పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో హీరోయిన్గా టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఎంపికయ్యారని సమాచారం. ఇటీవల ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి హిట్లు అందుకున్న ఈ బ్యూటీ తమిళంలో తన జెర్నీ ప్రారంభించబోతుంది. ప్రియాంక మోహన్, శ్రీనిధి శెట్టి వంటి పేర్లతో పాటు ఇప్పుడు మీనాక్షి చౌదరి చేరడం అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచింది.
ఇక ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుండడంతో రెండు ఇండస్ట్రీలలోనూ భారీ క్రేజ్ పొందనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.