ఈ వార్తను అనువదించండి:

ఎంపీ విజయసాయిరెడ్డి: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూతురుకి షాక్ ఇచ్చారు అధికారులు. విశాఖ జిల్లా భీమిలిలోఆయన కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. సీఆర్‌జడ్‌ గైడ్ లైన్స్‌ను ఉల్లంఘిస్తూ నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 1516, 1517, 1519, 1523 సర్వే నంబర్లలోని స్థలంలో ఈ కాంక్రీట్‌ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టులో పిటిషన్ వేయగా… విచారించిన ధర్మాసనం వైసీపీ ఎంపీ కుమారి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అక్రమానిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

పూర్తిగా చదవండి..