
ఎన్నికల ముందు వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎన్నికల అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రాజెక్టులు కొంతకాలం నిలిచిపోయాయి. అయితే, ఇటీవలే ‘హరి హర వీర మల్లు’ చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమాను జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ (OG)’ సినిమాను పూర్తి చేయనున్నారని సమాచారం.
ఇప్పటికే ‘ఓజీ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ అయిన పోస్టర్, టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా, శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా వార్తల ప్రకారం, ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ భార్య శిరీష లెల్ల కూడా కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
శిరీష, విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసి ఇండియాకు వచ్చి మోడలింగ్, నటనలో రాణించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో నారా రోహిత్ నటించిన ‘ప్రతినిధి 2’ సినిమాలో అవకాశం దక్కింది. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించగా, గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో కనిపించబోతుందన్న వార్తలు హాట్ టాపిక్గా మారాయి.
అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది నిజం అయితే శిరీషకు ఇది సినీ రంగ ప్రవేశానికి మంచి అవకాశంగా నిలవొచ్చు.