Jyothika reacts to Kanguva movie criticism
Jyothika reacts to Kanguva movie criticism

స్టార్ హీరో సూర్య నటించిన కంగువ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఎప్పుడూ వైవిధ్యమైన కథలు ఎంచుకునే సూర్య, ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే, ₹350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా దెబ్బతిన్నది. 100 కోట్ల వసూళ్లు కూడా అందుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముఖ్యంగా సినిమా సౌండ్ మిక్సింగ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలామంది ప్రేక్షకులు సౌండ్ ఎక్కువగా ఉండటం వల్ల డైలాగ్స్ స్పష్టంగా వినిపించలేదని అభిప్రాయపడ్డారు.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, దిశా పఠానీ, బాబీ డియోల్, కోవై సరళ, యోగి బాబు, జగపతి బాబు లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ & స్టూడియో గ్రీన్ కలిసి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. 10కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీతో తెరకెక్కిన ఈ సినిమా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ను పాటించినా, కథాపరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమా మీద వచ్చిన నెగటివ్ రివ్యూలపై సూర్య సతీమణి జ్యోతిక స్పందిస్తూ, “దక్షిణాదిలో వచ్చిన కొన్ని చెత్త సినిమాలు కమర్షియల్‌గా హిట్ అయ్యాయి. కానీ కంగువ వాటి కంటే మేలైన సినిమా” అని చెప్పారు. రివ్యూలు పూర్తిగా అన్యాయంగా రాశారని, ఎటువంటి విచక్షణ లేకుండా విమర్శలు చేయడం బాధాకరం అని ఆమె అన్నారు.

కంగువ ఫెయిల్యూర్ నేపథ్యంలో సూర్య తన తర్వాతి సినిమా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. బాక్సాఫీస్ వద్ద తిరిగి హిట్ కొట్టేందుకు స్ట్రాంగ్ స్క్రిప్ట్ & మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను ఎంచుకోవాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికి కంగువ ఓటమి కారణాలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *