ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ ‘కలి’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ ‘కలి’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రెస్పాన్స్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ సినిమాలో యంగ్ హీరో ప్రిన్స్ సిసిల్, నరేష్ అగస్త్య ముఖ్య పాత్రల్లో నటించారు. శివ శేషు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ లో ‘కలి’ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎంగేజింగ్ థ్రిల్లర్ కథ ఈ చిత్రాన్ని ఓటీటీ ఆడియెన్స్‌కి దగ్గర చేస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనపై ఈ సినిమా కథ నడుస్తుంది.

ఈ చిత్రాన్ని లీలా గౌతమ్ వర్మ ప్రొడ్యూస్ చేయగా, జీవన్ బాబు సంగీతం అందించాడు. ఈ సినిమాలో నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

The post ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ ‘కలి’ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *