
సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ‘భైరవం’ (Bhairava) సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తిరిగి సందడి చేసిన రాక్స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj), మే 30న విడుదలైన ఈ చిత్రం ద్వారా అభిమానులను మళ్ళీ తనవైపు తిప్పుకున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనోజ్ గజపతి పాత్రలో నటించగా, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ముఖ్యపాత్రలు పోషించారు. మంచి టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమాలో మనోజ్ స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
భైరవం ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొన్న మనోజ్, తన కెరీర్ గురించి ఓ ముదురు నిజాన్ని బయటపెట్టాడు. ‘‘రచ్చ (Racha) సినిమా ముందుగా నాకొచ్చింది. కానీ డేట్స్ కుదరలేదు. ఆ తర్వాత నా ఫ్రెండ్ రామ్ చరణ్ చేశాడు. అదే విధంగా ఆటోనగర్ సూర్య (Autonagar Surya) కూడా వదిలేశాను. అంతే కాదు, అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమా కూడా తొలుత నాకే వచ్చింది. కొన్ని కారణాల వల్ల వాటిని వదిలేశాను. నిజంగా అది బాధ కలిగించే విషయం. కానీ ఒకటి పోతే మరొకటి వస్తుంది అనుకుంటున్నా,’’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇతను వదిలేసిన ఆ బ్లాక్ బస్టర్ సినిమాలు అన్ని తర్వాత భారీ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ మాత్రం ‘‘ఈ సినిమాలు మనోజ్ చేసినా ఉండి ఉంటే ఆయన కెరీర్ టోటల్గా మారిపోయేది’’ అంటూ బాధపడుతున్నారు. మనోజ్ మాత్రం నిరాశ చెందకుండా తన పాత సినిమాల ఎంపికలను ఓపికగా స్వీకరిస్తూ, భవిష్యత్తులో మంచి కథలతో రానున్నట్లు సంకేతాలిచ్చాడు.
ఇక ‘భైరవం’ విజయంతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన మనోజ్, మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన కెరీర్ ఇకపై కొత్త దిశలో పయనించనుందనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తోంది.