మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు శుభారంభం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం మే 24న హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ చిత్రాన్ని సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహూ గారపాటి నిర్మిస్తుండగా, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మెగా డాటర్ సుశ్మిత కొనిదెల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను అర్చన ప్రజెంట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నయనతార, చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్తో సినిమా చేయాలనే కల ఈ ప్రాజెక్ట్తో నిజమవుతోంది. మొదటి రోజు నుంచే చిరంజీవి, ఇతర కీలక తారలపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే “సంక్రాంతికి వస్తున్నాం” అనే ట్యాగ్తో ఫ్యాన్స్ను ఉత్సాహపరిచిన అనిల్ రావిపూడి, తన స్టయిలిష్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. టెక్నికల్ టీమ్ పరిచయ వీడియో, నయనతార ప్రోమో వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ డ్యూటీ సమీర్ రెడ్డిపై ఉంది. మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ సిసిరోలియో పని చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, రైటింగ్ టీమ్గా ఎస్.కృష్ణ, జి.ఆది నారాయణ స్క్రిప్ట్పై కసరత్తు చేస్తున్నారు. ఎస్.కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ను ఎఎస్ ప్రకాష్ డీల్ చేస్తున్నారు.
ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోపై భారీ అంచనాలున్న ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు శుభారంభం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం మే 24న హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. ఈ చిత్రాన్ని సన్ షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహూ గారపాటి నిర్మిస్తుండగా, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మెగా డాటర్ సుశ్మిత కొనిదెల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను అర్చన ప్రజెంట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నయనతార, చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్తో సినిమా చేయాలనే కల ఈ ప్రాజెక్ట్తో నిజమవుతోంది. మొదటి రోజు నుంచే చిరంజీవి, ఇతర కీలక తారలపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే “సంక్రాంతికి వస్తున్నాం” అనే ట్యాగ్తో ఫ్యాన్స్ను ఉత్సాహపరిచిన అనిల్ రావిపూడి, తన స్టయిలిష్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. టెక్నికల్ టీమ్ పరిచయ వీడియో, నయనతార ప్రోమో వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ డ్యూటీ సమీర్ రెడ్డిపై ఉంది. మ్యూజిక్ డైరెక్టర్గా భీమ్స్ సిసిరోలియో పని చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, రైటింగ్ టీమ్గా ఎస్.కృష్ణ, జి.ఆది నారాయణ స్క్రిప్ట్పై కసరత్తు చేస్తున్నారు. ఎస్.కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ను ఎఎస్ ప్రకాష్ డీల్ చేస్తున్నారు.
ఈ భారీ మాస్ ఎంటర్టైనర్ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోపై భారీ అంచనాలున్న ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.