Nandamuri Heroes’ Sequels Raise Expectations
Nandamuri Heroes’ Sequels Raise Expectations

నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోలందరూ ప్రస్తుతం సీక్వెల్ సినిమాల మీదే దృష్టి పెట్టారు. ఈ ట్రెండ్‌ను బాలకృష్ణ నుంచి మోక్షజ్ఞ వరకూ అందరూ ఫాలో అవుతున్నారు. బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్ హిట్‌ను ఎంజాయ్ చేస్తూనే, అఖండ 2 కోసం బిజీగా ఉన్నారు. తొలిభాగం సెన్సేషనల్ హిట్ కావడంతో, సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఎన్టీఆర్ కూడా వార్ 2 షూటింగ్‌లో పాల్గొంటూ హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టనున్నారు. అలాగే దేవర 2 కూడా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సీక్వెల్ కోసం మేకర్స్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కల్యాణ్ రామ్ సైతం బింబిసార 2 కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం యాక్షన్ డ్రామా ఒకటి చేస్తూనే, త్వరలో బింబిసార 2 సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఈ సినిమా బిగ్ బడ్జెట్‌లో ప్రీక్వెల్ కానుంది.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీపై బిగ్ అంచనాలు ఉన్నాయి. ఆయన ఆదిత్య 999 మ్యాక్స్ అనే సై-ఫై మూవీతో వెండితెరకి పరిచయం కానున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య క్లాసిక్ హిట్ ఆదిత్య 369కి ఇది సీక్వెల్ కావడంతో, అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. మొత్తానికి నందమూరి హీరోలందరూ సీక్వెల్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *