
టాలీవుడ్ నటి నందినీ రాయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన ఒక భయానక అనుభవాన్ని షేర్ చేసింది. సికింద్రాబాద్కి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో అత్యద్భుతమైన గుర్తింపు పొందింది. Miss Hyderabad, Miss Andhra Pradesh వంటి ప్రతిష్టాత్మక బ్యూటీ కాంటెస్టుల్లో విజయం సాధించిన ఆమె, టాలీవుడ్లో ‘040’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాలతో పాటు Web Series ‘మెట్రో కథలు’, ‘గాలివాన’లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇటీవల ఆమె చెప్పిన ఒక గోవా ప్రయాణ అనుభవం ఆడియన్స్ను షాక్కు గురిచేసింది. “2017-18 టైంలో నా కెరీర్ డల్ అయింది. డిప్రెషన్లోకి వెళ్లాను. ఆ సమయంలో గోవాకు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఓ బీచ్ వద్ద నెగిటివ్ ఎనర్జీ నన్ను తాకింది. బీచ్ వాటర్లో నా కాలికి తగిలిన ఓ క్లాత్ను తీసి చూస్తే అందులో రెండు బొమ్మలు, మహిళ జుట్టు, సూదులు ఉన్నాయి. అది చూసి షాక్ అయ్యాను,” అని నందినీ చెప్పింది.
ఈ అనుభవం తర్వాత ఆమె ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. జ్వరాలు, నిద్రలేమి, అస్థమా లక్షణాలు కనిపించాయి. మానసికంగా చాలా వెయ్యిపడినట్లు చెప్పింది. “ఇలా రెండు సంవత్సరాలు సినిమాలకు దూరమయ్యాను. తర్వాత మెల్లిగా ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడ్డాను,” అని తెలిపింది.
ఇలాంటి అనుభవాలు ఆమె కెరీర్పై ప్రభావం చూపినా, తిరిగి సినిమాలు, వెబ్సిరీస్లతో అభిమానుల మద్దతుతో నందినీ రాయ్ మళ్లీ తన స్థానం పొందుతోంది.