వైరల్: సాయి పల్లవిపై భగ్గుమంటున్న నెటిజన్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings


మన టాలీవుడ్ సహా సౌత్ లో కూడా బాగా పాపులర్ అయ్యినటువంటి స్టార్ హీరోయిన్స్ లో నాచురల్ నటి సాయి పల్లవి కూడా ఒకరు. మరి సాయి పల్లవి హీరోయిన్ గా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ సినిమాలు చేస్తుంది కానీ లేటెస్ట్ గా సాయి పల్లవి ఊహించని విధంగా భారీ ఎత్తున నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇది వరకు సాయి పల్లవి ఎలాంటి కాంట్రవర్సీ లలో ఇరుక్కున్న దాఖలాలు లేవు కానీ ఆమె గతంలో చేసిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు నేషనల్ వైడ్ గా అటెన్షన్ అందుకున్నాయి. మన దేశపు సైన్యాన్ని పాకిస్తాన్ వారు టెర్రరిస్ట్ లు అనుకుంటారు అని, భారత సైన్యం, పాకిస్తాన్ సైన్యం ఒకటే అంటూ ఆమె చేసిన కామెంట్స్ పట్ల నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడో “విరాటపర్వం” సినిమా సమయంలో ఈమె చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవ్వడం మొదలయ్యాయి. కొంతమంది అయితే దీనిపై సాయి పల్లవి క్షమాపణ చెప్పి వివరణ ఇవ్వాలి అని కూడా ఫైర్ అవుతున్నారు. దీనితో సాయి పల్లవి ఊహించని విధంగా భారీ ఎత్తున నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది.

The post వైరల్: సాయి పల్లవిపై భగ్గుమంటున్న నెటిజన్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *