నివేదా థామస్, ఒక నేచురల్ పెర్ఫార్మర్గా సినిమాల్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న టాలెంటెడ్ యాక్ట్రెస్. 2002లో మలయాళ చిత్రం వెరుతె ఒరు భార్యలో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన నివేదా, అప్పుడే ఉత్తమ బాలనటి అవార్డు అందుకుంది.
తెలుగులో నాని సరసన జెంటిల్మన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, సైమా బెస్ట్ డెబ్యూ అవార్డును గెలుచుకుంది. తర్వాత నిన్ను కోరి, జై లవ కుశ, వకీల్ సాబ్, బ్రోచేవారెవరురా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది.
2024లో వచ్చిన 35 చిన్న కథ కాదు సినిమాలో తల్లి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలై మంచి రెస్పాన్స్ను రాబట్టింది. కే. విశ్వనాథ్ చిత్రాల స్ఫూర్తితో ఈ కథనాన్ని తీర్చిదిద్దారు అని నివేదా చెప్పింది.
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని కొత్త ఫోటోలు షేర్ చేసిన నివేదా, మరోసారి ఫ్యాన్స్ని ఆకట్టుకుంటోంది. ఆమె ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాలనటిగా మొదలై తన నటనతో ప్రజల మనసు దోచుకుంటున్న నివేదా థామస్, కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.