పాన్ ఇండియా లెవల్లో ఆసక్తికరంగా మారిన సినిమా వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొనగా, తాజాగా ఈ మూవీలో హీరోలు తీసుకుంటున్న పారితోషికం హాట్ టాపిక్గా మారింది.
‘RRR’ సినిమాకు తారక్ రూ. 45 కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత వస్తున్న ‘దేవర’ సినిమాకు ఏకంగా రూ. 60 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. మొదట ‘వార్ 2’ కోసం తారక్ రెమ్యునరేషన్ తగ్గించి రూ. 30 కోట్లకు ఒప్పుకున్నారని టాక్. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం వారు ఇప్పుడు మళ్లీ రూ. 60 కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం.
హృతిక్ రోషన్ గతంలో వార్ (2019) సినిమాలో నటించి హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే క్యారెక్టర్లో తిరిగి కనిపించనున్న ఆయన, ఈ సీక్వెల్ కోసం రూ. 48 కోట్లు తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇది చూస్తే ఎన్టీఆర్ హృతిక్ కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నట్టు క్లారిటీ వస్తోంది. ఇది కూడా తారక్కి పెరుగుతున్న పాన్ ఇండియా క్రేజ్, బాక్సాఫీస్ మార్కెట్ను బట్టి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఈ సినిమా 2025 ఆగస్ట్ 14న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది.