గ్లోబల్ బ్యూటీ ‘ప్రియాంక చోప్రా గ్లామర్, డీ గ్లామర్‌… ఇలా ఏ పాత్రలోనైనా అలవోకగా నటించి మెప్పించగలదు. అయితే, ఇలాంటి నటి మొదట్లో సినిమా రంగంలోకి రావడానికి ఒప్పుకోలేదట. ఈ విషయం గురించి తాజాగా ప్రియాంక తల్లి మధు చోప్రా క్లారిటీ ఇచ్చారు. మధు చోప్రా మాట్లాడుతూ.. ‘ప్రియాంక చోప్రా అప్పట్లో మిస్‌ వరల్డ్‌ పోటీల్లో విజేతగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ, ప్రియాంక చోప్రాకి సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదు. చదువులో కొనసాగుతూ.. క్రిమినల్‌ సైకాలజిస్ట్‌గా, లేకపోతే ఏరోనాటికల్‌ ఇంజినీర్‌గా అవ్వాలని గోల్ పెట్టుకుంది’ అంటూ మధు చోప్రా చెప్పింది.

ప్రియాంక చోప్రా సినీ ఎంట్రీ గురించి మధు చోప్రా ఇంకా మాట్లాడుతూ.. ‘విధికి వేరే ప్లాన్స్ ఉంటాయి కదా. వరుస ఆఫర్లు వస్తుంటే.. చదువులు ఎక్కడికి పోవు, ఒక్క సినిమాలో నటించమని నా కూతుర్ని నేనే ఒత్తిడి చేశాను. అలా నా బలవంతంతో తన మొదటి చిత్రానికి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రియాంక చోప్రా సంతకం చేసింది. ఆ తర్వాత మాత్రం సినిమాల్లోనే నటించాలని ప్రియాంక చోప్రా నిర్ణయం తీసుకుంది’ అంటూ మధు చోప్రా చెప్పింది. ఇక ‘ప్రియాంక చోప్రా’ నిక్ జోనస్ ను 2018లో ఘాడంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది.

The post ‘ప్రియాంక’ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒప్పుకుందట ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *