మరో భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన నాగవంశీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్‌లో వరుస సినిమాలను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వాటిని సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా మలుస్తున్న ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఇప్పటికే పలు సినిమాలను లైన్‌లో పెట్టింది. ఇక ఈ బ్యానర్‌పై వచ్చే సినిమాలను ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి తెరకెక్కిస్తుంటారు. ప్రముఖ నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

అయితే, ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి మరో క్రేజీ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘‘దసరా రోజున రాజు తిరిగి పట్టుకొస్తాడు’’ అనే క్యాప్షన్‌తో ఓ భారీ సినిమాను ప్రకటించారు. బిగ్గెస్ట్ హిస్టారికల్ క్లెయిమ్‌గా ఈ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందని ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి మిగిలిన ఏ విషయాలను కూడా వారు వెల్లడించలేదు.

దీంతో దసరా రోజున ఈ బ్యానర్ అనౌన్స్ చేయబోయే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏమిటా.. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారా అనేది ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది.

The post మరో భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన నాగవంశీ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *