‘పుష్ప-2’ ప్రీమియర్స్‌కు రంగం సిద్ధం.. ఫస్ట్ షో పడేది అప్పుడేనా? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘పుష్ప 2 ది రూల్’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 విడుదలకు మరో నెలన్నర రోజులు సమయం ఉంది. ఐతే, ఈ సినిమాకి పాన్ ఇండియా ప్రచారం చేయాల్సి ఉంది. పాన్ ఇండియా ప్రమోషన్స్ అంటే కనీసం నెల రోజులు సమయం పడుతుంది. ప్రస్తుతం, బన్నీ ఇదే ప్లానింగ్ లో వున్నారని.. ‘పుష్ప 2’ ప్రచారం మొత్తం నార్త్ ఇండియా టార్గెట్ గా సాగుతుందని టాక్ నడుస్తోంది.

ఈ క్రమంలోనే ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ముంబాయిలో ప్లాన్ చేస్తున్నారట. అలాగే, నేషనల్ లెవెల్ లోనే క్రేజీ చిట్ చాట్ లు, ఇంటర్వూలు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. కాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

The post నార్త్ ఇండియా టార్గెట్ గా ‘పుష్ప 2’ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *