
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల ఒక సినీ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాట్లాడుతున్న సమయంలో కమెడియన్ అలీని ఉద్దేశించి అసభ్య పదాలను వాడారు. ఇది మామూలుగా ఉండకపోవడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంతేకాకుండా, తనకు ఎన్టీఆర్ అవార్డు వచ్చిన విషయం చెప్పినపుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టకపోవడంపై మండిపడి, “బుద్దుందా?” అంటూ వారిని ప్రశ్నించారు.
దీంతో పాటు, స్టేజ్ పైనే ఉన్న అచ్చిరెడ్డిని ఉద్దేశించి “బయటకు రా, నీ సంగతి తేలుస్తా” అంటూ హెచ్చరించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యాఖ్యలతో రాజేంద్రప్రసాద్ వ్యవహార శైలి పట్ల సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అసంతృప్తి నెలకొంది. ఓ సీనియర్ నటుడు ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్ల స్పందనలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.