
బాలీవుడ్లో ఆడియన్స్ను ఊహించలేని రీతిలో అలరించిన యాక్షన్ సిరీస్ ‘ధూమ్’ ఇప్పుడు తన నాలుగవ భాగానికి సిద్ధమవుతోంది. 2004లో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజీ ‘ధూమ్’, ‘ధూమ్ 2’, ‘ధూమ్ 3’ అనే మూడు భాగాలతో వరుసగా సూపర్ హిట్లను సాధించింది. ప్రస్తుతం ‘ధూమ్ 4’ కోసం పెద్ద ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్గా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సారి విలన్ పాత్రలో నటించబోతున్న హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కావడంతో, ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది.
ధూమ్ సిరీస్కు ప్రత్యేకత ఏంటంటే – ప్రతిసారీ విలన్ పాత్రకు స్టార్ హీరోనే తీసుకోవడం. హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ లాంటి టాప్ హీరోలు విలన్లుగా నటించి సిరీస్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పుడు రణబీర్ కపూర్ కూడా తన చాక్లెట్ బాయ్ ఇమేజ్ని పక్కనపెట్టి, మాస్ యాక్షన్ విలన్గా మెప్పించనున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా, శ్రీధర్ రాఘవన్ కలిసి స్క్రీన్ప్లే అందించారు.
ఈ స్క్రిప్ట్ దాదాపు పూర్తైపోయింది. త్వరలోనే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. రణబీర్ ప్రస్తుతం రామాయణం, లవ్ అండ్ వార్, బ్రహ్మాస్త్ర 2, యానిమల్ పార్క్ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, వాటి తర్వాత ‘ధూమ్ 4’ షూటింగ్కి జాయిన్ కానున్నాడు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఆదిత్య చోప్రాతో ఆయన ఇప్పటికే చర్చలు జరిపారట.
ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ, బాలీవుడ్లో ఈ ప్రాజెక్ట్ పైన భారీ హైప్ నెలకొంది. రణబీర్ విలన్గా ఎలా మెప్పిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధూమ్ 4 ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.