Published on Nov 14, 2024 8:05 AM IST


వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరించారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ అయి డీసెంట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలోనూ దూసుకుపోతోంది. రేవు చిత్రం రీసెంట్‌గా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ క్రమంలో రేవు చిత్రం ఆహాలో ట్రెండ్ అవుతోంది. ఇలా ఓటీటీలోనూ తమ చిత్రానికి మంచి ఆదరణ దక్కుతుండటంతో చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

కోస్తా తీరంలోని పాలరేవులో అంకాలు(వంశీరామ్ పెండ్యాల), గంగయ్య(అజయ్) మధ్య ఉండే వైరం.. వారి జీవన శైలి, తీర ప్రాంత పరిస్థితులను చక్కగా చూపించారు. టెక్నికల్‌గా పరంగా ఈ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఆర్టిస్టుల పర్ఫామెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఓటీటీలోనూ రేవు చిత్రానికి మంచి స్పందన దక్కుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *