Published on Nov 2, 2024 9:06 PM IST

మన ఇండియన్ సినిమా గర్వించదగ్గ పలు భారీ చిత్రాల్లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లతో చేసిన చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి ఈ సినిమా దెబ్బతో వరల్డ్ వైడ్ తెలుగు సినిమా పేరు మారు మోగిపోయింది. అంతే కాకుండా ఈ సినిమాతోనే తెలుగు సినిమాకి మొదటిసారి ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది.

అయితే వెస్ట్రన్ ఆడియెన్స్ ని ఎంతగానో అలరించిన ఈ సినిమా మేకర్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ ఇపుడు వచ్చింది. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి ఎలాంటి ట్యూన్స్ అందించారో తెలిసిందే. మెయిన్ గా తన సాంగ్ నాటు నాటు కే ఆస్కార్ కూడా వచ్చింది.

ఇలా ఆస్కార్ స్టేజి మీద అవార్డు అందుకున్న కీరవాణి ఇపుడు 2025 లండన్ లో ఓ ఎపిక్ షో అయితే ఇవ్వబోతున్నారు. అక్కడ ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో కీరవాణి RRR సంగీతాన్ని లైవ్ లో ఆలపించనున్నారు. దీంతో అక్కడ బుకింగ్స్ ని ఓపెన్ చేయగా RRR స్కోర్స్ ని లైవ్ లో ఎక్స్ పీరియన్స్ చేయాలి అంటే బుక్ చేసుకొని రావచ్చని తెలిపారు. మరి ఈ లైవ్ ఆర్కెస్ట్రా 2025 మే 11 న జరపనున్నట్టుగా అనౌన్స్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *