
బాలీవుడ్ బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ ‘క్యోంకి సాస్ భీ కభీ బహు థీ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలిసారి 2000లో ప్రారంభమైన ఈ సీరియల్ అప్పట్లో ఇంటి పట్టున మారిపోయింది. ఇప్పుడు దీని రెండవ సీజన్ రాబోతుందన్న వార్తతో అభిమానులు, టీవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో కూడా స్మృతి ఇరానీ ప్రధాన పాత్ర ‘తులసి’గా మళ్లీ కనిపించనుండడం విశేషం.
ఈ సీరియల్ను ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. స్మృతి ఇరానీ మరోసారి నటుడు అమర్ ఉపాధ్యాయ్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, స్మృతి ఇరానీ ఈ సీజన్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండియా ఫోరం (India Forums) పేర్కొంది. ఎపిసోడ్కు ఆమె తీసుకుంటున్న పారితోషికం సుమారు ₹14 లక్షలుగా ఉంది. అయితే ఇది అధికారికంగా ధృవీకరించబడలేదు. అంతేకాదు, షూటింగ్ సమయంలో ఆమెకు Z+ security కల్పించినట్లు తెలుస్తోంది.
సెట్ లో భద్రత కోసం కఠినమైన నిబంధనలు పాటిస్తున్నారు. మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదు. షూటింగ్ సెట్స్లోకి సాధారణ వ్యక్తులను వెళ్లనివ్వడం లేదు. ప్రస్తుతానికి పోస్టర్ షూటింగ్ పూర్తైపోయింది. త్వరలో ప్రోమో షూటింగ్ కూడా మొదలుకాబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ రెండవ సీజన్ ఎప్పుడు ప్రసారం అవుతుందన్నదానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. హార్ట్టచింగ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు తులసి పాత్రలో స్మృతి ఇరానీ మళ్లీ ప్రేక్షకులను కట్టిపడేస్తుందా? అనేది ఆసక్తికర అంశం కానుంది.