పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఒక కొత్త డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడూ రెండు మూడు సినిమాలను ఒకేసారి సెట్స్పై ఉంచే డార్లింగ్, ఇప్పుడు పూర్తి ఫోకస్ ఒక్క సినిమాపైనే పెట్టాలని ఫిక్స్ అయ్యారట.
ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్లతో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూటింగ్ మొదలు కావలసి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా కోసం మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది.
ఈ చిత్రానికి డైరెక్టర్ సందీప్ రెడీ వంగా. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్లు ఇచ్చిన ఆయన ఇప్పుడు ప్రభాస్ను పూర్తి భిన్నంగా చూపించాలనుకుంటున్నారు. అందుకే ప్రభాస్ పూర్తిగా స్పిరిట్ షూటింగ్కి డెడికేట్ అయ్యేలా బల్క్ డేట్స్ అడుగుతున్నారట.
ఈ కారణంగా, ప్రభాస్ ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్స్ అయిన ది రాజాసాబ్ మరియు ఫౌజీ పూర్తిచేసిన తరువాతే స్పిరిట్ సెట్స్పైకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీని వల్ల స్పిరిట్ షూటింగ్ కనీసం నాలుగు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మాస్ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్ కలిపిన ఈ కథ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభాస్ తాజా ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి!