ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం SSMB 29. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) రూపొందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) అనంతరం తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) లీడ్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్ హీరో చేరనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లేటెస్ట్ రూమర్ ప్రకారం ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. కథ విన్న విక్రమ్ వెంటనే ఒప్పేసుకున్నాడని టాక్. రాజమౌళి ఏది చేసినా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి, విక్రమ్ పాత్ర కూడా పవర్ఫుల్గా ఉంటుందని ఊహిస్తున్నారు. విక్రమ్ – మహేష్ – రాజమౌళి కాంబో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో కథానాయికగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కనిపించనుంది. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా కావడం విశేషం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి (M.M. Keeravani) సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా విడుదలకు 2027 నిశ్చితమైంది.
మహేష్ బాబు, విక్రమ్, ప్రియాంక చోప్రా, రాజమౌళి అనే భారీ స్టార్స్ ఒకే సినిమాలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. ఇది నిజమైతే, టాలీవుడ్లో ఓ నూతన రికార్డ్ ఖాయం!