
ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో త్రిప్తి డిమ్రీ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకపోయినా, తన టాలెంట్తోనే ఇంత తక్కువ సమయంలో బాలీవుడ్లో మంచి గుర్తింపు పొందింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన “యానిమల్” సినిమాలో చిన్న పాత్ర పోషించి, ఆ చిత్రం ఆమె కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత త్రిప్తి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్గా మారి, పలువురు దర్శకుల నుండి వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారింది.
త్రిప్తి ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా పేరుగాంచింది. నివేదికల ప్రకారం, ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.30 కోట్లు ఉండొచ్చు. ఆటో మొబైల్స్లో కూడా ప్రత్యేక ఇష్టం కలిగి ఉండటం ఆమె గ్యారేజీలో బ్లూకలర్ పోర్స్చే 911, రేంజ్ రోవర్ స్పోర్ట్, రెనాల్డ్ డస్టర్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ బ్లూకలర్ పోర్స్చే 911 కారు ధర సుమారు రూ.2.11 కోట్లు అని అంటున్నారు.
కెరీర్ విషయంలో చూస్తే, త్రిప్తి అన్వితా దత్ దర్శకత్వంలో 2020లో వచ్చిన “బుల్బుల్” సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత “ఖాలా”లో నటించి, 2023లో విడుదలైన “యానిమల్” సినిమాతో తన కెరీర్లో భారీ మలుపు తిప్పుకుంది. ఈ మధ్య కాలంలో “బ్యాడ్ న్యూజ్” మరియు “భూల్ భూలయ్యా 3” వంటి హిట్ చిత్రాలతో తన స్థానాన్ని మరింత గట్టిగ చేసింది. ప్రస్తుతం “స్పిరిట్” సినిమాతో మరింత ముందుకు సాగుతోంది.