హైదరాబాద్ హిమాయత్నగర్లో ‘ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్’ కొత్త బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. దసరా వేళ జరిగిన ఈ కార్యక్రమాన్ని పద్మశ్రీ డా. బ్రహ్మానందం ప్రారంభించి, ఆర్గానిక్ పదార్థాలతో తయారైన ఐస్క్రీంలను అందరూ ఆస్వాదించాలని ఆహ్వానించారు.
డాక్టర్ సుహాస్ బి. శెట్టి నాయకత్వంలో నడుస్తున్న ఈ క్రీమరీ, ఆరోగ్యకరమైన సేంద్రీయ పదార్థాలతో ప్రత్యేక రుచులను అందించనుంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డా. బ్రహ్మానందం హాజరై, ఈ కొత్త వెంచర్ విజయవంతం కావాలని ఆశించారు.
ఈ సందర్భంగా నీలోఫర్ కేఫ్ అధినేత ఎ. బాబురావు, సుమన్ టీవీ అధినేత సుమన్ దూడి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. అతిథులంతా ఐస్బర్గ్ ఆర్గానిక్ ఉత్పత్తులను రుచి చూసి, సేంద్రీయతపై సంస్థ నిబద్ధతను ప్రశంసించారు.
The publish పద్మశ్రీ బ్రహ్మానందం చేతుల మీదుగా ‘ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్’ ప్రారంభం first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.
