Sun. May 31st, 2026
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!

Prudhvi Raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ తాజాగా జరిగిన ‘రిస్క్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఈ మధ్య మూవీ ప్రమోషన్స్ జరుగుతున్న విధానం పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు సినిమా ప్రమోషన్స్ పేరిట ఎంతో ఖర్చు చేసి కాలేజీలకు వెళ్లి స్టూడెంట్స్ ను కలుస్తున్నారు అని.. అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కడు కూడా తరువాత సినిమాకు రాడని ఆయన అభిప్రాయపడ్డారు.

దీంతో ఇప్పుడు ‘రిస్క్’ సినిమా తీసిన ఒక్కప్పటి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా వృధాగా కాలేజీల్లో ప్రమోషన్స్ కు డబ్బు తగలెయ్యదని, దాని బదులు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఉపయోగించుకుని సినిమాను విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో నటుడు పృథ్వీరాజ్ ప్రమోషన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.