సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు ఉపశమనం కలిగించింది. ఆయన ప్రస్తుతం ‘రాకా’ షూటింగ్ షెడ్యూల్తో బిజీగా ఉండటంతో, వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇస్తూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించింది.
ఈ కేసు విచారణను కోర్టు జూలై 29, 2026కు వాయిదా వేసింది. డిసెంబర్ 2024లో ‘పుష్ప 2’ ప్రీమియర్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసు ప్రస్తుతం ప్రీ-ట్రయల్ దశలో ఉంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో ‘రాకా’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ ఏడాది లోపు షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
The put up సంధ్య థియేటర్ కేసు: అల్లు అర్జున్కు కోర్టు ఉపశమనం.. వర్చువల్ హాజరుకు అనుమతి! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.
