Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త బయటకు వచ్చింది. ఇటీవల బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన రామ్ చరణ్, ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టుల షెడ్యూల్పై కూడా చర్చ మొదలైంది. సమాచారం ప్రకారం, రామ్ చరణ్ తన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ, భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు వెళ్లారు. అక్కడ జూలై 27న ఆయనకు మణికట్టుకు శస్త్రచికిత్స జరగనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ అనంతరం కొన్ని వారాలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
‘పెద్ది’ చిత్రంలో కుస్తీ నేపథ్యంలో తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ, సినిమా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో దానిని కొంతకాలం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గాయం ఉన్నప్పటికీ చేతికి చిన్న కట్టు కట్టుకుని సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం చరణ్ కమిట్మెంట్కు నిదర్శనంగా అభిమానులు పేర్కొంటున్నారు. ఈ సర్జరీ కారణంగా రామ్ చరణ్ కొంతకాలం విశ్రాంతి తీసుకోనుండటంతో, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న RC17 చిత్ర షూటింగ్ కూడా ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్ ఫైనల్ స్క్రిప్ట్ పూర్తి చేసి, మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకోగా, నటసింహం బాలకృష్ణ కూడా తన 111వ సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో మోకాలికి గాయపడి సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా షూటింగ్లో గాయపడటంతో, స్టార్ హీరోలు తమ సినిమాల కోసం ఎంతటి రిస్క్ తీసుకుంటున్నారో మరోసారి స్పష్టమవుతోంది.
