Mon. Jun 29th, 2026

సమంత హీరోయిన్‌గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పటికే రెండో వారంలోకి ప్రవేశించగా, వసూళ్లు రూ. 75 కోట్ల మైలురాయిని దాటి బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా అద్భుత విజయంగా నిలిచింది. శుక్రవారం కంటే శనివారమే ఈ చిత్రం అధిక వసూళ్లు సాధించింది. ఈ రోజు ఆదివారం కాబట్టీ, వసూళ్లు ఇంకా బలంగా ఉండే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే బుక్‌మైషో టికెట్ అమ్మకాలు మాత్రమే 124వేలు దాటి, ముందు రోజు సంఖ్యలను అధిగమించాయి.

కాగా సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు. మొదట ఆయన ప్రేక్షకులను అడగ్గా, ఆడియన్స్ నుండి వచ్చిన భారీ రెస్పాన్స్ చూసి పార్ట్-2ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ​ఇప్పటికే తన మైండ్‌లో ఒక ఐడియా ఉందని, సేమ్ టీమ్‌తోనే ఈ సీక్వెల్ ఉంటుందని రాజ్ తెలిపారు. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఇన్‌స్పిరేషన్ తనకు కలగడం ఇదే తొలిసారి అని, రాబోయే చిత్రం డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

The put up బుక్‌ మైషోలో దూసుకెళ్తున్న ‘మా ఇంటి బంగారం’ first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.